తీర్థం మూడుసార్లు ఎందుకు తీసుకుంటారు?

ఆలయాల్లో దైవదర్శనం అనంతరం తీర్థాన్ని స్వీకరిస్తాం. ఆచార్యుల వారు మూడుసార్లు భక్తులకు తీర్థాన్ని ఇస్తారు. మొదటిసారి తీసుకునే తీర్థం శరీరశుద్ధికి, రెండో సారి ధర్మసాధనకు, మూడోసారి పరమపదం కోసమని పెద్దలు చెబుతారు. అనేక దేవాలయాల్లో రాగి పాత్రల్లో తీర్థాన్ని ఇస్తుంటారు.రాగిపాత్రలోని నీళ్లు అనేక రోగాలను నయం చేస్తాయి. నీళ్లలో కలిపే తులసి ఆకులతో పలు రుగ్మతలు నయమవుతాయి.